కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగపూర్ గ్రామ శివారు చెరువు కట్ట సమీపంలో ఉన్న ఆలయంలో ఈధమ్మ విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన బందె షరీఫ్ అనే వ్యక్తి సోమవారం రాత్రి ధ్వంసం చేసాడు.
సోమవారం మధ్యాహ్నం సమయంలో కట్టఫై ఉన్న మడెల్లి రాజు ఆలయంలో హుండీ దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా పోలీసులకు అప్పగించారు.
అయితే పోలీసులు అతన్ని వదిలి పెట్టడంతో ఆలయాన్ని ధ్వంసం చేస్తానని గ్రామస్థులతో ఛాలెంజ్ చేసాడు.
ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పగా పట్టించుకోలేదని, దాని వల్లనే విగ్రహాన్ని ధ్వంసం చేసారని గ్రామస్థులు, బీజేపీ, విహెచ్ పి నాయకులు ఆరోపించారు.
ఆలయంలో ధ్వంసమైన విగ్రహాన్ని, దొంగతనం జరిగిన ఆలయాన్ని కామారెడ్డి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు.
విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు.