చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని సంధ్య థియేటర్ వెనకవైపు నున్న పెద్దకాపు లేఅవుట్ లో గోడకూలి వ్యక్తి మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి పూజ బేకరీ నిర్వాహకుడు రత్నవేలు( 42)గా పోలీసులు గుర్తించారు. పది సంవత్సరాలుగా నివాసముంటున్న రత్నవేలు రెండు రోజుల క్రితం ఇంటి యజమాని నిర్ణయంతో ఇల్లు ఖాళీ చేసాడు. పాత భవనం కావడంతో ఇంటిని ఇంటి యజమాని కూల్చివేస్తున్నారు.
తాను ఖాళీ చేసిన ఇంటిలో మరిన్ని ఇంటి సామానులు ఉన్నాయని తీసుకెళ్లడానికి వెళ్లిన రత్నవేలు పై ఇంటి గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య పూజ బోరున విలపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా కు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఈస్ట్ ఎస్ఐ ఎస్ .జయచంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.