కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న లింగపూర్ శివారులో గల చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుని భార్య తెలిపిన వివరాల ప్రకారం నారాయణ్ ఖేడ్ గ్రామానికి చెందిన సకినాల మల్లేష్(32) దేవునిపల్లికి చెందిన రాజేశ్వరి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
9 సంవత్సరాల క్రితం దేవునిపల్లికి బ్రతుకుదెరువు కోసం వచ్చి వంటలు, మెస్ట్రీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి 6 సంవత్సరాల కూతురు మమత ఉంది. అయితే మల్లేష్ కు తాగుడు అలవాటు ఉండటంతో భార్యను కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడు. ఇలా జరిగినప్పుడల్లా నారాయణ్ ఖేడ్ వెళ్లిపోయేవాడు. మూడు రోజుల క్రితం మద్యం షాపులు ఓపెన్ కావడంతో పూటుగా తాగి భార్యను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
ఎప్పటిలాగే ఇంటికి వెళ్ళిపోయాడు అనుకున్న రాజేశ్వరి వెతకడం మానుకుంది. నేడు చెరువులో పడి మృతిచెందాడని తెలియడంతో అక్కడికి చేరుకుని రోదించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు