37.2 C
Hyderabad
March 29, 2024 20: 39 PM
Slider జాతీయం

పుల్వామాలో ఉగ్రవాదుల దాడి: ఒక పోలీసు అధికారి మృతి

#jummuandkashmir

పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఒక  పోలీసు అధికారి మరణించారు. ఆదివారం నాడు దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పోలీసులు, CRPF బృందాలు సంయుక్తంగా తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంలో ఈ బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. దాడిలో ఒక ఏఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన ఏఎస్‌ఐని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం నుంచి కాపాడలేకపోయారు. సర్క్యులర్ రోడ్డు బాతురా క్రాసింగ్ సమీపంలోని నాకా పాయింట్ వద్ద ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాల ఇతర బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.

Related posts

ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి డైలాగ్ లా జగన్ పాలన

Satyam NEWS

అలీని పరామర్శించిన మంత్రి తలసాని

Satyam NEWS

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో విజయనగరం యూత్ ఫౌండేషన్ భేటీ

Satyam NEWS

Leave a Comment