పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఒక పోలీసు అధికారి మరణించారు. ఆదివారం నాడు దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో పోలీసులు, CRPF బృందాలు సంయుక్తంగా తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంలో ఈ బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. దాడిలో ఒక ఏఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన ఏఎస్ఐని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం నుంచి కాపాడలేకపోయారు. సర్క్యులర్ రోడ్డు బాతురా క్రాసింగ్ సమీపంలోని నాకా పాయింట్ వద్ద ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాల ఇతర బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.