సూర్యాపేట జిల్లా చివ్వెంల బీసీ గురుకుల పాఠశాలలో జరిగిన దుర్ఘటనలో ఒక విద్యార్ధి మరణించారు. అక్కడ నీటి సంపు కూలి ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక విద్యార్థి మృతి చెందారు. గాయపడ్డ విద్యార్థులలో మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన సుశాంత్, మోతే మండలం అప్పన్నగూడెం గ్రామానికి చెందిన ఆర్ పవన్, శాలిగౌరారం మండలం ఎస్ లింగోటం గ్రామానికి చెందిన మరో విద్యార్థి గాయపడ్డట్టు సమాచారం. విద్యార్థులంతా మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నట్లు సమాచారం.
previous post
next post