28.7 C
Hyderabad
April 20, 2024 03: 23 AM
Slider నిజామాబాద్

కౌలాస్ నాలా ప్రాజెక్టు లో పడి ఒకరు గల్లంతు

#Koulas Nala Project

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు ను తిలకించేందుకు వచ్చిన పర్యాటకుడు ఒకరు నీటిలో పడి గల్లంతయ్యారు.

108లో పని చేసే బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన గడ్డం సుభాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ప్రాజెక్ట్ అందాలను తిలకించిన అనంతరం స్నానం కోసం నీటిలో  దిగగా నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.

మునిగిపోయిన సుభాష్ కోసంఇప్పటి వరకు గాలింపు కొనసాగుతున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉండే గడ్డం సుభాష్ నీటిలో పడి కొట్టుకు పోయారన్న వార్త బిచ్కుంద మండలంలో విషాదం నింపింది.

అంబులెన్స్ లో నిరుపేద కుటుంబాలకు ఎంతగానో సేవలందించిన ఆయన అకాల మరణం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.

దీంతో మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకుని  ఉన్నాయి ఇప్పటి వరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

Related posts

1300 సంవత్సరాల తర్వాత: సూర్యగ్రహణం ప్రత్యేకత ఇదీ

Satyam NEWS

పాలేరులో గడప గడపకూ కాంగ్రెస్

Satyam NEWS

యాదాద్రికి పోటెత్తిన భక్తులు…

Satyam NEWS

Leave a Comment