సోంపేట మండలం కొర్లాం సమీపంలో జాతీయరహదారి పై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించింది. మృతురాలు సోంపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పామల సోమేశ్వరి (50)గా గుర్తించారు. ఆమె స్కూటీ పై వెళుతుండగా స్కూటీకి లారీ తగలడం తో వెనుక కూర్చొన్న సోమేశ్వరి జారి పడ్డది.
దాంతో తల వెనుక భాగం లో తీవ్ర గాయం అయింది. తల వెళ్లి రోడ్డుకు బలంగా తగలడం వలన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనలో గాయ పడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.