Slider హైదరాబాద్

పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట: మహిళ మృతి

#gandhihospital

పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి దుర్మరణం పాలయ్యారు. అదే విధంగా ఒక బాలుడి పరిస్థితి విషమం గా మారింది. దిల్‌షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ X రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చింది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు.

Related posts

కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ కు అనుమతి నిరాకరణ

Satyam NEWS

తొక్కిసలాట తర్వాత కూడా విపరీతమైన రద్దీ

Satyam NEWS

జాతిపిత గాంధీకి ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment