39.2 C
Hyderabad
April 25, 2024 17: 07 PM
Slider వరంగల్

Red Alert: ఏజెన్సీ ప్రాంతంలో విష జ్వరంతో మహిళ మృతి

#pittala rama

అటవీ ప్రాంతాలలో విషజ్వరాలు ప్రబలే కాలం కావడంతో ఆ ప్రభావంతో ఒక మహిళ మృతి చెందిన దారుణ సంఘటన ఇది. ములుగు జిల్లా, ములుగు మండలం జంగాల పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని క్రాస్ రోడ్ లో ఈ సంఘటన చోటు చేసుకున్నది.

పిట్టల రమా (30) అనే మహిళకు  గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను  ములుగు ఆసుపత్రిలో చూపించగా  పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు.

దాంతో అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎం కు ఆమెను తరలించారు. అయితే అక్కడ కూడా ఆమెకు ఉపశమనం కలగలేదు. అక్కడ చికిత్స పొందుతూ రమా మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి భర్త గోపాల్, కూతురు రుచిత(10)  కుమారుడు పండు  8 (నెలలు) ఉన్నారు.

నిరుపేద కుటుంబానికి చెందిన రమా మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. రమా మృతి చెందిన విషయం తెలియడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

నిరుపేద ఆయన రమా కుటుంబాన్ని   ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related posts

ప్రభుత్వ ఫించన్ పంపిణీ స్వాహా..! వలంటీర్లపై వేటు..!

Satyam NEWS

లక్ష్యాల మేరకు ప్రగతి సాధించాలి

Bhavani

అన్ని ఏర్పాట్లు పూర్తి

Murali Krishna

Leave a Comment