చిత్తూరు జిల్లాలో ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. చౌడేపల్లి మండలం రాజనాల బండ వద్ద టెంకాయల వ్యాపారం చేసే నాగవేణి (35) అనే వివాహితను దారుణంగా గొంతు కోసి హత్యచేశారు.
మృతురాలికి తెల్లనీల పల్లె కు చెందిన శ్రీనాథ్ తో 17 సంవత్సరాల కిందట ప్రేమ వివాహం జరిగింది. రాజనాల బండవద్ద టెంకాయల వ్యాపారం తో పాటు 15 మంది బృదం తో చెక్కభజన కార్యక్రమాలకు వెళుతూ ఆమె జీవనం సాగిస్తుంటుంది.
నాగవేణి కి 10వ తరగతి, 8వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. రాత్రి ఫోన్ మాట్లాడుతూ తోటలోకి వెళ్లి తిరిగి రాలేదని నాగవేణి తల్లి చెబుతున్నారు.
ఉదయం తోట లో వెతికినా కనపడలేదని, బండ వద్ద గొర్రెల కాపరి ఆమె మృతదేహాన్ని గుర్తించి గ్రామం లో సమాచారం అందించడం తో విషయం తెలిసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.