40.2 C
Hyderabad
April 19, 2024 15: 40 PM
Slider చిత్తూరు

చిత్తూరు జిల్లాలో వివాహిత దారుణ హత్య

#murdercase

చిత్తూరు జిల్లాలో ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. చౌడేపల్లి మండలం రాజనాల బండ వద్ద టెంకాయల వ్యాపారం చేసే నాగవేణి (35) అనే వివాహితను దారుణంగా గొంతు కోసి హత్యచేశారు.

మృతురాలికి తెల్లనీల పల్లె కు చెందిన శ్రీనాథ్ తో 17 సంవత్సరాల కిందట ప్రేమ వివాహం జరిగింది. రాజనాల బండవద్ద టెంకాయల వ్యాపారం తో పాటు 15 మంది బృదం తో చెక్కభజన కార్యక్రమాలకు వెళుతూ ఆమె జీవనం సాగిస్తుంటుంది.

నాగవేణి కి 10వ తరగతి, 8వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. రాత్రి ఫోన్ మాట్లాడుతూ తోటలోకి వెళ్లి తిరిగి రాలేదని నాగవేణి తల్లి చెబుతున్నారు.

ఉదయం తోట లో వెతికినా కనపడలేదని, బండ వద్ద గొర్రెల కాపరి ఆమె మృతదేహాన్ని గుర్తించి గ్రామం లో సమాచారం అందించడం తో విషయం తెలిసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

బిఓసిడబ్ల్యు కార్డుతో భీమా సౌకర్యం

Satyam NEWS

ఈటల రాజేందర్ ప్రత్యర్థి ఇప్పుడు ఇక టీఆర్ఎస్ లోకి..?

Satyam NEWS

కాంగ్రెస్ లోకి జూపల్లి: బోగస్ ప్రచారంపై మాజీ మంత్రి సీరియస్

Satyam NEWS

Leave a Comment