నాగర్ కర్నూల్ జిల్లా కోడెరు మండలం మైలారం ఠాగూర్ తండా కు చెందిన మూడవత్ శివ ప్రమాద వశాత్తు నిన్న మధ్యాహ్నం కొండ్రావుపల్లి దగ్గర ఉన్న సింగోటం నుంచి గుడిపల్లికి వెళ్లే కాలువలో పడి గల్లంతయ్యాడు. నిన్నటి నుంచి సంఘటన స్థలంలో ఫైర్ సిబ్బంది, మండల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.
నేటికీ కూడా మృత దేహం లభించకపోవడంతో నేడు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటన స్థలాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. అక్కడ ఉన్న SIతో, అధికారులతో ఘటన కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వీలైనంత త్వరగా గజ ఈతగాళ్లను పిలిపించి మృత దేహం లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతుడి కుటుంబసభ్యులతో జూపల్లి మాట్లాడి ధైర్యం కోల్పోవద్దని ప్రభుత్వం పరంగా అందవలసిన సహాయాన్ని అందించేందుకు కృషిచేస్తానని చెప్పారు. వారిని ఓదార్చి ధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కొండ రాధ వివిధ గ్రామాల సర్పంచ్ లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.