28.7 C
Hyderabad
April 25, 2024 03: 50 AM
Slider ప్రకాశం

పెండింగ్ పనులపై సీఎంను కలిసిన ఒంగోలు ఎంపి

#MaguntaSrinivasulureddy

ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయాలని ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు.

నేడు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి కాంపు కార్యాలయంలో కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ పనులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ కింది పనులు పూర్తిచేసేందుకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

1.నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైను త్వరితగతిన పూర్తి చేయడం

2.కనిగిరి నియోజక వర్గంలో ట్రిపుల్ ఇటి కాలేజీకి శంఖుస్థాపన

3. మార్కాపురంలో మెడికల్ కాలేజీకి శంఖుస్థాపన

4. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి  దర్శి నియోజకవర్గంలో దొనకొండ ప్రాంతంలో  ఆర్మీ లాబు, ఏవీ నుంచి వి. యల్. యఫ్. స్టేషన్ ఏర్పాటుకు వారు సుముఖత చూపినందున వారితో మాట్లాడి వాటితో పాటు ఎక్కువ పరిశ్రమలు ఏర్పాటు.

5. ఒంగోలు పట్టణ వాసులకు ఇళ్ళ స్థలాలకు సంబంధించిన కోర్టు పరమైన సమస్యలు పరిష్కారానికి అడ్వకేటు  జనరల్ తోను, తదితరులతోను కృషి చేసి స్తలాల త్వరగా ఏర్పాటు.

6. వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు పూర్తయినందున, ఆర్. ఆర్. ప్యాకేజీ పనులు కూడా త్వరగా పూర్తిచేసి అనుకున్న సమయానికి తాగునీరు – సాగునీరు ప్రజలకు అందించే ఏర్పాటు.

Related posts

రైతు రుణమాఫీ చేయాలని బిజెపి డిమాండ్

Satyam NEWS

Over-The-Counter > Instant Home Remedies For High Bp In Hindi Does Brown Help Lower Blood Pressure

Bhavani

సచివాలయం, తహాశీల్దార్ పరిధిలోనే ప్రజా సమస్యల పరిష్కారం

Satyam NEWS

Leave a Comment