28.7 C
Hyderabad
April 25, 2024 04: 21 AM
Slider ముఖ్యంశాలు

ఆన్‌లైన్‌ తరగతులతో సరికొత్త చరిత్రకు నారాయణ శ్రీకారం

Narayana

సంక్లిష్ట సమయాలు, సంక్షోభ సమయాలు మాత్రమే సరికొత్త ఆలోచనకు దారితీస్తాయి అని మరోసారి రుజువు చేసింది నారాయణ. ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన కోవిడ్‌ 19 కారణంగా భారతదేశం ఒక్కసారిగా లాక్‌డౌన్‌లోకి వెళ్ళిపోయింది.

ఈ ఊహించని పరిణామంతో స్కూల్స్‌తో పాటు అన్ని విద్యా వ్యవస్థలన్నీ మూతపడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం ఏర్పడకూడదనే సంకల్పంతో నారాయణ ఆన్‌లైన్‌ క్లాసుకు శ్రీకారం చుట్టింది.

విద్యార్థులకు నిరంతరం చేరువ అయ్యేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానం సహాయాన్ని వినియోగించుకుంటోంది. ఈ ఆన్‌లైన్‌ క్లాసు ద్వారా టీచర్‌ చెప్పే పాఠ్యాంశాలను డైరెక్టుగా ఇంట్లోనే వినవచ్చు. సాధన చేయవచ్చు. సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు.

పరీక్ష రాయవచ్చు. పరీక్షల్లో చేసే తప్పును తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నారాయణ బ్రాంచుల్లో అమలు చేస్తోంది నారాయణ. రోజుకి సగటున 10000 కు పైగా విద్యార్థులు ప్రత్యక్షంగా ఆన్‌లైన్‌ తరగతులను వీక్షిస్తున్నారు.

75000 కు పైగా విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ది పొందుతున్నారు. ఎన్‌ లెర్న్‌, ఎన్‌ కనెక్ట్‌, నారాయణ ఆన్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌ ద్వారా వెబ్‌, ఆండ్రాయిడ్‌ వెర్షన్‌తో ట్యాబ్‌, మొబైల్‌ ప్లాట్‌ఫామ్స్‌పై అందిస్తోంది.

 ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించటంతో పాటు పరీక్ష అనంతరం చేసే తప్పు ఒప్పులపై విశ్లేషణను వీడియో ద్వారా పరిష్కారాలను అందిస్తోంది. అంతేకాకుండా డైలీ అసైన్‌మెంట్‌, సొల్యూషన్స్‌, ఆడియో ఉపన్యాసాలు, క్యూరెటెడ్‌ వీడియోలో ఎన్‌ లెర్న్‌ యాప్‌ ద్వారా నేరుగా విద్యార్థుల మొబైల్‌ ఫోన్‌కు పంపిస్తారు.

దేశవ్యాప్తంగా ఈ తరహా ఆన్‌లైన్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఒక్క నారాయణకు మాత్రమే దక్కింది. ఈ ఆన్‌లైన్‌ విద్యావిధానం ద్వారా భవిష్యత్తులో మరిన్ని మార్పు విద్యావ్యవస్థలోకి రాబోతున్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు.

https://www.testseries.narayanagroup.com/

Related posts

సెక్రటేరియేట్ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం

Satyam NEWS

నూతన కార్మిక భవనం కార్మికులకు ఆధునిక దేవాలయం కావాలి

Satyam NEWS

నీలోఫర్‌ హాస్పిటల్‌ లో మౌలిక వసతులకు ఏడీపీ సాయం

Satyam NEWS

Leave a Comment