40.2 C
Hyderabad
April 24, 2024 17: 20 PM
Slider నిజామాబాద్

సార్వజనిక్ గణేష్ మాత్రమే ప్రతిష్టిద్దాం

#Ganesh Mandap

వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా కామారెడ్డి జిల్లా బిచ్ కుంద మండల కేంద్రంలో వందల వరకు వినాయక ప్రతిమలు మండపాలు ఏర్పాటు చేస్తారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ఈ ఏడాది కూడా అలానే చేస్తే సామాజిక దూరం పాటించడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

దీనివల్ల ఆ మహమ్మారి మరింతగా విజృంభించే అవకాశం ఉంది. అందుకోసం ఈసారి ఒకే సార్వజనిక్ గణేష్ మండపం ఏర్పాటు చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఒకే చోట వినాయక ప్రతిమను ప్రతిష్టించుకుని  పూజలు నిర్వహించుకుందామని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు.

దీని వలన కొంత మేరకైనా కరోనా ను ఎదుర్కొంటామని వారు అన్నారు.ఈ సమావేశంలో పెద్దలు మల్లికార్జునప్ప షెట్కార్, కమల్ కిషోర్, ప్రముఖ వ్యాపారవేత్త కోలావార్ శివకుమార్ సేట్, ఎంపిపి అశోక్ పటేల్, ఉపసర్పంచ్ నాగరాజు, జడ్పిటిసి భారతి రాజు, సొసైటీ చైర్మన్ బాలాజీ, మహీపతి హనుమాన్లు సెట్, మాజీ జడ్పీటీసీ సాయిరాం, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి పాల్గొన్నారు.

ఇంకా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్,దశరథ్ స్వామి, సోపాన్, పాషా సెట్,గ్రామ యువకులు గణేష్ గొoడా బస్వరాజ్ ,చేతన్, సాయిని బస్వరాజ్ ,బాస సహదేవ్,కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తం అగర్వాల్ ,పీఎంపీలు ప్రభాకర్, నర్సింలు, డాక్టర్ రాజు,ఎంపీటీసీ అవారి సురేష్ ,నౌషా నాయక్, పలువురు  వ్యాపారులు, యువకులు పెద్దలు కూడా పాల్గొన్నారు.

Related posts

కేసుల శాశ్వతంగా కేసుల‌ పరిష్క‌రానికి లోక్ అదాల‌త్

Satyam NEWS

ఏఓబీ పరిధిలో కొఠియా ప్రజల భద్రతకు భరోసా కల్పించిన ఏపీ పోలీసులు..!

Satyam NEWS

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ నేత ఆకాంక్ష

Satyam NEWS

Leave a Comment