సౌదీ ఆరేబియాలో వ్యాక్సినేషన్ చేసుకున్న వారికి మాత్రమే మసీదుల్లో అనుమతి ఉంటుందని చెబుతోంది. గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలపై సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా కీలక ప్రకటన చేసింది. కేవలం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ రెండు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆ దేశ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు అక్టోబర్ 10 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సందర్శకులు గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.