30.7 C
Hyderabad
April 24, 2024 01: 16 AM
Slider ఆధ్యాత్మికం

హంస వాహనం పై ఒంటిమిట్ట కోదండ రాముడు

#Ontimitta

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం రాత్రి హంస వాహనంపై శ్రీ కోదండ‌రాముడు దర్శన భాగ్యం కలిగించారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ర‌మేష్ బాబు, ఏఈవో ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ధ‌నంజ‌యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

సస్పీషియస్ డెత్: కలకలం రేపిన విద్యార్థి మృతి

Satyam NEWS

డబుల్ బెడ్ రూమ్ లకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హామీ

Satyam NEWS

డ్రగ్స్ మాఫియా ను ప్రశ్నిస్తే తెలుగుదేశం పై దాడి చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment