నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో కొత్తగా నిర్మించిన సెటర్స్ కు ఓపెన్ టెండర్ నిర్వహించాలని మండల పరిషత్ అధికారి లక్ష్మీ నరసింహ కు బుధవారం కొల్లాపూర్ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు తమటం సాయి కృష్ణ గౌడ్, కొల్లాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి, ఎల్లేని యువసేన నాయకులు ఎండి. ఇమ్రాన్ ఖాన్ వినతి పత్రం ఇస్తూ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుట్టుచప్పుడు కాకుండా సెటర్స్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.అలా జరిగితే ఆందోళన చేపడతామన్నారు. అధికారికంగా పేపర్ ప్రకటన చేసి ఓపెన్ టెండర్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఏ పార్టీ నాయకుల కైన,ఎవరికైనా రావచ్చు. ఏదైనా పద్ధతి ప్రకారం జరగలన్నారు. లేని యెడల కార్యాలయాని ముట్టడిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
నాయకులు బాగానే వుంటారు. అధికారులే తర్వాతా జరగ బోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఓపెన్ టెండర్ ప్రకారమే సేటర్స్ ఇస్తామని అధికారి చెప్పినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, పిన్నంశెట్టి శివ,నరసింహ తదితరులు పాల్గొన్నారు.