40.2 C
Hyderabad
April 19, 2024 16: 50 PM
Slider ముఖ్యంశాలు

14న బి‌ఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభం

#brs

ఈనెల 14న దిల్లీలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. హస్తినలోని సర్దార్ పటేల్‌మార్గ్‌లో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే దిల్లీ చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా  ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.  14వ తేదీ యాగంతో పాటు ప్రారంభోత్సవానికి చెందిన ఏర్పాట్లు, కార్యాలయంలో అవసరమైన ఫర్నీచర్‌ వంటి వాటిని పరిశీలించారు.  కేసీఆర్‌తో పాటు కుటుంబసభ్యులు, కొందరు ముఖ్యనేతలు కూడా హస్తిన వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా పలువురు జాతీయ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. భారత్ రాష్ట్ర సమితి, జాతీయ రాజకీయాలకు సంబందించిన అంశాలపై చర్చించనున్నారు.

Related posts

ఆధునిక భావ విప్లవకారుడు యోగి వేమన

Bhavani

ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఛాయాచిత్ర ప్రదర్శన

Satyam NEWS

అదుపుతప్పి పొలాల్లోకి తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Satyam NEWS

Leave a Comment