కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగినేని అభిలాష్ రావు ఆకర్ష మొదలు పెట్టారు.దీనితో అధికార పార్టీ కార్యకర్తలు ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలెట్టారు. దీంతో అధికార పార్టీ నాయకులకు చెమటలు పడుతున్నాయి.సోమవారం రంగినేని అభిలాష్ రావు సమక్షంలో,వీపనగండ్ల మండల అధ్యక్షుడు గోదల బీరయ్య ఆధ్వర్యంలో బొల్లారం గ్రామ టీఎర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.తెలంగాణ రాష్ట్రంలో , కొల్లాపూర్ లో నియంత పాలన నుంచి విముక్తి పొందడానికి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
చిన్నంబావి మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ ఆడిటోరియంలో బొల్లారం టీఆర్ఎస్ నేతలకు రంగినేని అభిలాష్ రావు గారు, గోదల బీరయ్య కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సంధర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారమే లక్ష్యంగా పని చేయాలని,పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేయాలని కోరారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీపనగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూపని తిరుపతయ్య,మద్దిలేటి,గోపాల్ రెడ్డి,సాయిబాబు,రాము,ఈశ్వరయ్య,శివుడు,మహేష్,రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు.