పాకిస్తాన్ లోనూ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని తొమ్మిది ఉగ్రవాద శిక్షణా కేంద్రాలపై భారతదేశం దాడి చేసిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మంత్రులతో ఇతర కీలక సమావేశాలు రద్దు అయ్యాయి. ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం, భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరగనున్నది. భారతదేశం-పాకిస్తాన్ పరిస్థితి ఇంకా జటిలం అవుతున్న ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ X లో పోస్టు చేస్తూ, ప్రపంచం ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ చూపించాలని కోరారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించిన తరువాత, భారతదేశం కూడా ఈ దాడుల గురించి అమెరికాకు వివరించినట్లు తెలిసింది. “ఇది త్వరగా ముగిసి, శాంతియుత పరిష్కారం దిశగా భారత, పాకిస్తాన్ వెళతాయని భావిస్తున్నాము అని అమెరికా తెలిపింది.
భారతదేశం విజయవంతంగా తటస్థీకరించిన పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు:
మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ – జెఇఎం
మర్కజ్ తైబా, మురిద్కే – ఎల్ఇటి
సర్జల్, తెహ్రా కలన్ – జెఇఎం
మెహమూనా జోయా, సియాల్కోట్ – హెచ్ఎం
మర్కజ్ అహ్లే హదీత్, బర్నాలా – ఎల్ఇటి
మర్కజ్ అబ్బాస్, కోట్లి – జెఇఎం
మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి – హెచ్ఎం
షావాయి నల్ల క్యాంప్, ముజఫరాబాద్ – ఎల్ఇటి
సైద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ – జెఇఎం