ప్రతిపక్ష కాంగ్రెస్ బిజెపి పార్టీలు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీలోని తన వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారు ఎన్ని పగటి కలలు కన్నా రాబోయే రోజుల్లో కెసిఆర్ నాయకత్వంలో తిరిగి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలోంచి మైక్ లాక్కోవడం సరైనది కాదని అన్నారు.
ఎమ్మెల్యే గా ఉండి ఒక మంత్రిని అవమానించడం, దాడికి పాల్పడడం అమానుష మన్నారు. హుజురాబాద్ లో ప్రవేశపెట్టిన పథకాలు అన్ని కూడా గత బడ్జెట్ సమావేశంలో ఆమోదం పొందినవే నని, కాగా వాటి పట్ల ప్రతిపక్షాలు గగ్గోలు చేయడం సరైనది కాదన్నారు.
ఈ సమావేశంలో తెరాస నాయకులు వనమా వెంకటేశ్వర్లు, ఉప్పల్ రెడ్డి, రంగా వెంకటేశ్వర్లు, బూరుగు కృష్ణయ్య, శీల సత్యనారాయణ, వెలుపల్లి సందీప్, నాగరాజు, కుక్కల భిక్షం తదితరులు పాల్గొన్నారు.
పెద్ది నరేందర్, నకిరేకల్, సత్యం న్యూస్