28.7 C
Hyderabad
April 25, 2024 05: 21 AM
Slider నిజామాబాద్

చనిపోయినా నలుగురికి గుర్తున్నాడు

#umashankar

బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన యువకుని అవయవదానం

బ్రెయిన్ డెడ్ తో మరణించిన ఓ యువకుడి అవయవాలు దానం చేసి మరో నలుగురికి ప్రాణం పోసాడు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన ఉమా శంకర్ గౌడ్ హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ తో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతని అవయవాలు దానం చేశారు. ఉమా శంకర్ గౌడ్ బిచ్కుంద మండలంలో విద్యుత్ శాఖలో మూడేళ్ళుగా పని చేస్తున్నాడు. ఇటీవల అతని ఆరోగ్యం బాగా లేకపోవడంతో యశోద ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ తో నేడు మృతి చెందగా అతని అవయవాలు దానం చేశారు. దాంతో ఉమా శంకర్ చనిపోయి మరో నలుగురికి ప్రాణదానం చేయడం పట్ల పలువురు ఆ కుటుంబ సభ్యులను ప్రశంసిస్తున్నారు.

Related posts

మండలి వైస్ ఛైర్మన్ కు  ఎంపీ వద్దిరాజు అభినందన

Satyam NEWS

విశాఖ ఆసుపత్రిలో కన్నీళ్లు తెప్పించే ఘోరం

Satyam NEWS

రైల్వే కోడూరు వైసీపీ లో భగ్గు మన్న నిరసన

Satyam NEWS

Leave a Comment