కృష్ణాజిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు ఓ భక్తుడు భారీగా కానుకలు సమర్పించాడు.
విజయవాడ ఎన్ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడు రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలను అందించాడు.
దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు వాటిని అందించి, ఆయన కుటుంబం ఆశీర్వాదం తీసుకుంది.
అమ్మవారికి ప్రతి గురువారం నగలను అలంకరిస్తామని ఆలయ పండితులు తెలిపారు.