రాత్రింబవళ్ళు రోడ్లపైనే తింటూ రోడ్లపైనే పడుకుంటున్న పోలీసులకు వడదెబ్బ నుండి రక్షణ కల్పించేందుకు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందచేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కూడళ్ల వద్ద గస్తి నిర్వహిస్తున్న పోలీసులకు ఆయన స్వయంగా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ లను అంద చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించడానికి పోలీసులు, డాక్టర్లు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని అన్నారు. అందుకే మా పోలీస్ బిడ్డలను రక్షించుకోవడం కోసం ఓ ఆర్ ఎస్ పాకెట్లను అంద చేస్తున్నామని ఆయన అన్నారు.