38.2 C
Hyderabad
April 25, 2024 11: 13 AM
Slider ప్రకాశం

ఓరుగంటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు గురించి సీఎం కు చెప్పండి

#appi reddy

ఓరుగంటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఓరుగంటి రెడ్డి కులస్తులను సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఓరుగంటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేయాలని ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి  నాయకులు బుధవారం సాయంత్రం తాడేపల్లి లోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ విషయమై ఇప్పటికే జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ లను సమితి నాయకులు కలిసి వినతిపత్రాలు అందజేసే ఉన్నారు. ఓరుగంటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు అవసరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లవలసిందిగా కోరినారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చీరాల వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఓరుగంటి రిజర్వేషన్ పోరాట సమితి కలిసి ఓరుగంటి రెడ్డి  కార్పొరేషన్ ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది అని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

లేళ్ల అప్పిరెడ్డి ని కలిసిన వారిలో బక్క జయరామిరెడ్డి, మేడి బోయిన వెంకట్ రెడ్డి, నంగు వెంకటేశ్వర్ రెడ్డి, నాయుడు నాగార్జున రెడ్డి, దేవు రెడ్డిమ్మ, బక్క శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Related posts

సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబి లోకి నెట్టిన్రు

Satyam NEWS

సొంత ఇంట్లో కాలిపోయి కనిపించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని

Bhavani

అశోక్ గౌడ్ కు మాతృవియోగం: పరామర్శించిన ములుగు జడ్పీ చర్మన్

Satyam NEWS

Leave a Comment