తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా చేసే యంత్రాల పైప్ లైన్ లో సమస్యలు రావడంతో ఐ సి యూలో ఘోరం జరిగింది. అనధికార సమాచారం ప్రకారం దాదాపు 11 మంది రోగులు మరణించినట్లు సమాచారం అందుతున్నది.
మరో 18 మంది వరకూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని సమాచారం. అధికారికంగా ఎవరూ ఏమీ చెప్పడం లేదు. వెంటిలేటర్ పైన ఉన్న పేషెంట్లు ఆక్సిజన్ సరఫరా లేక ఇబ్బంది పడుతున్నారు. టెక్నికల్ సిబ్బంది ఈ సమస్యను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.
ఫిల్లింగ్ చేసేటప్పుడు కంప్రెజర్ తగ్గటంతో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆక్సిజన్ సరఫరా మళ్లీ మొదలయ్యిందంటున్న అధికారులు. అయితే కుదుటపడని పరిస్థితి తో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.
ఆక్సిజన్ కోసం ఐసీయూ వార్డులో పేషెంట్ల బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఐసీయూ వార్డులో వస్తువులను రోగుల బంధువులు పగులగొట్టారు. భయంతో నర్సులు, డాక్టర్లు, సిబ్బంది పరుగులు తీశారు. దాంతో కోవిడ్ ఆస్పత్రి నుంచి వైద్య సిబ్బంది వెళ్లిపోయింది.