పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని శ్రీ రాట్నాలమ్మ వారిని టోక్యో ఒలింపిక్ కాంస్యపతాక విజేత P V సింధు నేడు దర్శించుకున్నారు. సందర్భంగా P V సింధు కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఒలింపిక్స్ లో పతకం సాధించిన P V సింధును ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పివి సింధు మాట్లాడుతూ ఒలింపిక్స్ కి వెళ్లే ముందు రాట్నాలమ్మ వారిని దర్శించుకుని వెళ్లాను. అమ్మవారి ఆశీస్సులతో పతకాన్ని గెలుచుకున్నానని చెప్పారు. అందరి ఆశీస్సులు ఇలానే ఉండాలని ఆమె కోరారు. మరెన్నో పతకాలు పొందాలని అమ్మవారిని కోరుకున్నా అంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపింది.