హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం టిఆర్ఎస్ బిసి సెల్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు శత జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి టిఆర్ఎస్ బిసి సెల్ అధ్యక్షుడు తూముల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ దక్షిణాది నుంచి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి పీవీ నరసింహారావుఅని అన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో పీవీ నరసింహారావు గారు తన ఆర్థిక సంస్కరణలతో భారత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహానుభావుడు మన తెలుగు వారు పీవీ నరసింహారావు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బిసి సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి గోవిందరావు, బిసి సెల్ ఉపాధ్యక్షులు శీలం సైదులు, వేణు, శ్రీను, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.