ప్రముఖ నటీమణి పద్మజ లంకా స్వీయ రచన- నిర్మాణం-దర్శకత్వంలో… ద్విపాత్రాభినయం చేస్తూ రూపొందించిన లఘు చిత్రం ‘మలుపు’.
సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో ‘మలుపు’ చిత్రం స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకుంది.
ఈ కాంటెస్ట్ కి ప్రముఖ దర్శకులు తేజ, వి.ఎన్. ఆదిత్య, హరీష్ శంకర్ తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి..జీరో బడ్జెట్ తో తాను తెరకెక్కించిన ‘మలుపు’ చిత్రం.
పలువురు ప్రఖ్యాత దర్శకుల మన్ననలు అందుకోవడం, స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు బహుముఖ ప్రతిభాశాలి పద్మజ లంకా.