పత్రికా రంగంలో తనదైన ముద్రవేసుకున్న ప్రగతిశీలి, నిగర్వి, నిరాడంబరుడు సోలిపేట రామలింగ రెడ్డి అని కొనియాడారు. అనారోగ్యం తో మృతి చెందిన దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగా రెడ్డి భౌతిక కాయానికి ఆయన నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో రామలింగ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన మరణం దుబ్బాక ప్రజలకు, తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన సేవలు చిరస్మరనియం అని కొనియాడారు.
చిట్టాపూర్ గ్రామం లో రామలింగారెడ్డి భౌతిక కాయానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, చీఫ్ విప్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు మానిక్ రావు, చంటి క్రాంతి కిరణ్ రామలింగ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
ఇంకా, ఎం.భూపాల్ రెడ్డి, జాజల సురేందర్, ఎమ్మెల్సీ లు కర్నే ప్రభాకర్, ఫరీదుద్దీన్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , TSIIC చైర్మన్ బాలమల్లు, తెరాస నాయకులు బిక్షపతీ తదితరులు కూడా రామలింగ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.