ఉత్తరాంద్ర కల్పవల్లి, విజయనగరం రాజుల ఆరాధ్య దేవత,శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవ తేదీలు ఖరారు అయ్యాయి. ఈమేరకు ఆలయ ఈఓ కిషోర్ కుమార్ పైడితల్లి అమ్మవారి జాతర తేదీలను తెలియ చేసారు.
వచ్చే నెల అక్టోబర్ 18 న పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం..ఆ మర్నాడు 19 వ తేదీన మంగళవారం అమ్మవారి సిరిమాను ఉత్సవం జరుగుతుంది.అదే విధంగా అక్టోబర్ 26 వ తేదీన తెప్పొత్సవం.. నవంబర్ 2న ఉయ్యాల కంబాల ఉత్సవం జరుగుంది.
ఈ నెల 23 వ తేదీ నుంచీ వచ్చే నవంబర్ 11 వరకు అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి.ఈ నెల 23 న చదురగుడి, వనం గుడి వద్ద పందిర రాట వేయడం జరుగుతుంది. చదురు గుడి వద్ద ఉదయం 9 గంటలకు వనం గుడి వద్ద పదకొండుగంటలకు పందిర రాట వేస్తారు.
అలాగే వచ్చే నెల పదమూడవ తేదీన అర్డమండల దీక్ష ప్రారంభమవుతుంది. అలాగే వచ్చే నెల అక్టోబర్ 31 వ తేదీన వనం గుడి వద్ద కలశ జ్యోతి ఊరేగింపు ఉంటుంది. అలాగే నవంబర్ 3 న వనంగుడి వద్ద చండీ హోమం,పూర్ణాహుతి, దీక్ష విరమణ కార్యక్రమాలు ఉంటాయని దేవస్థాన ఆలయ ఈఓ కిషోర్ కుమార్ తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో ఆలయ పూజారి బైరాగి నాయుడు, దేవస్థానం సూపరెంటెండెంట్ లు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. గతేడాది కరోనా మూలంగా నామమాత్రంగా మొక్కబడిగా సాగింది…అమ్మవారి జాతర మహోత్సవం. కేవలం ఆలయ ఉద్యోగులు రెవిన్యూ,పోలీస్ ,మీడియా సిబ్బంది తప్ప భక్తులెవ్వరికి ప్రవేశం కల్పించలేదు.
ఆ సమయంలోకరోనా సెకండ్ వేవ్ విస్త్రతంగా విజృంభిస్తున్న వేళ…మొక్కుబడిగానే అమ్మవారి జాతర మహోత్సవాలు జరిగాయి.అయితే సారి థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ….ఆ సమయంలో నమోదైన కేసుల బట్టి అమ్మవారి జాతర అట్టహసంగా జరుగుతుందా లేదా…? నామ మాత్రంగా జరుగుతుందాన్నది చూడాల్సి ఉంది.