39.2 C
Hyderabad
April 25, 2024 16: 40 PM
Slider ప్రత్యేకం

ఉపరాష్ట్రపతి కి జ్ఞాపికను అందజేసిన డిప్యూటీ తాసిల్దార్ శివ కుమార్

#venkaiahnaidu

అనేక రోజులు శ్రమించి తన స్వహస్తాలతో వేసిన పెయింటింగ్ ను నాగర్ కర్నూల్ జిల్లా శ్రీరంగాపూర్ డిప్యూటీ తాసిల్దారు శివకుమార్ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కు అందచేశారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఎన్నికైన రోజున శ్రీరంగాపూర్ డిప్యూటీ తాసిల్దారు శివకుమార్ తన సతీమణితో వెళ్లి ఆయనను కలిశారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడితో కలిసి తీయించుకున్న ఫొటోను శ్రీరంగాపూర్ డిప్యూటీ తాసిల్దారు శివకుమార్ తన స్వహస్తాలతో పెయింటింగ్ గా మలిచారు. ఈ జ్ఞాపికను అందించేందుకు అప్పాయింట్ మెంట్ కోరగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ లోని తన నివాసానికి రావలసిందిగా కోరారు.

నేడు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి ఈ జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శివ కుమార్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, బి టీవీ సీఈవో డాక్టర్ మురహరి బుద్ధారం, సెక్యూరిటీ ఎసిపి త్రిలోకనాథ్ రెడ్డి చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జ్ఞాపికను అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి డీటీ శివ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అవుట రాజశేఖర్ సత్యం న్యూస్ నెట్, నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

Corona: ఇంట్లో దాక్కొనే కాలం మళ్లీ దాపురిస్తుందా…?

Satyam NEWS

జై హో స్టాలిన్ : కోవిడ్ ఆస్పత్రులను సందర్శించిన ముఖ్య మంత్రి

Satyam NEWS

గుడ్ డెసిషన్: పౌల్ట్రీ ఫారం యాజమాన్యాల ఔదార్యం

Satyam NEWS

Leave a Comment