టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్బంగా ఆయన పెన్సిల్ చిత్రాన్ని గీసి అందర్నీ ఆకట్టుకున్నాడు పటాన్ చెరు కు చెందిన చిట్ల కార్తీక్.
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకోవాలని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సంకల్పాన్ని అనుసరిస్తూ మొక్కని కూడా నాటాడు.
51వ పెన్సిల్ పోర్ట్రెయిట్ # ఆర్ట్గిఫ్ట్ ప్రదర్శించిన చిట్ల కార్తీక్ 10వ క్లాస్ విద్యార్థి. ఎన్ సీసీ క్యాడెట్ (NCC Cadet) కూడా. హైదరాబాద్ శివారులోని బి.ఎచ్.ఈ.ఎల్, పటాన్చెరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుతున్నాడు.
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ పై ప్రేమతో 67 వ పుట్టినరోజు సందర్భంగా చిత్రం గీసి బహుమానంగా ప్రదర్శించాడు. అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా కూడా ఆమె చిత్రం బహుమతిగా గీసి పలువుర్ని ఆకర్శించాడు కార్తిక్.
ఇటీవలే తన అన్నయ్య కుందన్ ఆర్థిక మంత్రి హరీష్ రావు పుట్టునరోజు సందర్బంగా చిత్రం తీయగా, రాచకొండ సీపీ మహేష్ భగవత్ పుట్టినరోజు సందర్బంగా ఆయన చిత్రం డ్రా చేశారు.
2020 లో లాక్ డౌన్ విధించినప్పటి నుండి చిట్ల కుందన్, కార్తీక్ సోదరులు ఇద్దరూ ఫ్రంట్ లైన్ యోధుల పెన్సిల్ ఆర్ట్స్ వేస్తున్నారు. 82 మంది ఫ్రంట్ లైన్ పోలీసులు, ఆర్మీ, డాక్టర్, నర్సు, జర్నలిస్టులు, జీహెచ్ఎంసీ, ఇతరుల పెన్సిల్ పోర్ట్రెయిట్ గీశారు. ఇద్దరు కళాకారులు తన పెద్ద అన్న శ్రీనాథ్ ప్రేరణతో 2013-14 నుండి పెయింటింగ్ వేయడం ప్రారంభించారు.