భారత్లో భారీ విధ్వంసానికి పాకిస్తాన్ కుట్ర చేస్తోంది. దేశంలో చొరబాట్లకు టెర్రరిస్టులను ఎగదోస్తోంది. కానీ ఎప్పటికప్పుడు పాక్ కుట్రలను భగ్నం చేస్తోంది ఇండియన్ ఆర్మీ. తాజాగా జమ్ముకశ్మీర్లో ఓ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్న సంగతి తెలిసిందే. తనకు పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చినట్లుగా వెల్లడించాడు.
గత కొన్ని వారాలుగా ఉరి, రాంపూర్ సెక్టార్ల గుండా భారీ చొరబాట్లకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ముష్కరులు. బాబర్ ఆలీ .. పాకిస్తాన్లోని ఒకారా పంజాబ్లోని దిలాపూర్ జిల్లా నివాసి. వాస్తవానికి, సైన్యం చుట్టుముట్టిన తర్వాత లొంగిపోతానని, అలీ బాబర్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సభ్యుడిగా తెలిపాడని సైన్యం వెల్లడించింది.
సెప్టెంబర్ లో నియంత్రణ రేఖపై చొరబాటు ప్రయత్నం ప్రారంభమైనప్పుడు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ఉన్నారు, నలుగురు తిరిగి పాక్కు పారిపోయారు. మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు సెప్టెంబర్ 25 న డ్రెయిన్లో దాక్కున్నారు. 26 న ఒక ఉగ్రవాదిని కాల్చి చంపారు.