జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తీసేసిన భారత్ అక్కడ ఇప్పటి వరకూ 4 లక్షల 30 వేల మంది కాశ్మీరేతరులకు పౌరసత్వం ఇచ్చిందని పాకిస్తాన్ ప్రకటించింది.
1947లో జమ్మూ కాశ్మీర్ ను అక్రమించిన భారత్ ఇటీవల దానికి స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి ఇతర రాష్ట్రాల వారికి అక్కడ పౌరసత్వం కల్పిస్తున్నదని పాకిస్తాన్ వెల్లడించింది.
ఇది కేవలం జమ్మూ కాశ్మీర్ జనాభా ముఖ చిత్రాన్ని మార్చేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పన్నిన కుట్రగా పాకిస్తాన్ అభివర్ణించింది.
కాశ్మీర్ లో దాదాపు 65 శాతం వరకూ ముస్లింల జనాభా ఉందని, కొన్ని ప్రాంతాలలో నూటికి నూరు శాతం ముస్లింలు ఉండేవారని, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా అక్కడ ముస్లింల సంఖ్యను తగ్గించే విధంగా ఇతర రాష్ట్రాల వారికి కాశ్మీర్ పౌరసత్వం ఇస్తున్నదని పాకిస్తాన్ తెలిపింది.
ఇది అన్యాయమని దీనివల్ల కాశ్మీర్ ముఖ చిత్రం మారిపోతున్నదని పాకిస్తాన్ ఆవేదన వ్యక్తం చేసింది.
జమ్మూ కాశ్మీర్ లోని నిజమైన స్థానికులు పౌర సత్వానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడం లేదని, దీన్ని భారత ప్రభుత్వం అదనుగా తీసుకుని వేరే వారికి అక్కడ ప్రవేశ పెడుతున్నదని పాకిస్తాన్ ఆరోపించింది.