పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో విష వాయువులు వెలువడి ఆరుగురు మరణించిన ఘటన చోటు చేసుకుంది. కరాచీ నగరంలోని కీమారీ ఓడరేవులో ఓ కార్గో షిప్ నుంచి కెమికల్ ట్యాంకులు దించుతుండగా విషవాయువు వెలువడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా , మరో 12 మంది శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా దీనికి విచారణ జరిపి కారణమైన వారికి నోటీసులు జారీ చేశామని సింధ్ రాష్ట్ర సీఎం మురాద్అలీ షా తెలిపారు.