28.7 C
Hyderabad
April 24, 2024 06: 42 AM
Slider ప్రపంచం

పండుగ వేళ భారత్ లో ఉగ్రదాడికి తీవ్రవాదుల ప్లాన్

రాబోయే పండుగ రోజుల్లో దేశంలో భారీ దాడులకు తెగబడేందుకు ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు మరోసారి హెచ్చరించాయి. మన దేశంలోకి చొరబడేందుకు 40 మంది అఫ్గాన్‌ ఉగ్రవాదులు పన్నాగాలు రచిస్తున్నట్టు తెలిపింది. పాక్‌ మద్దతుతో దేశంలోకి చొరబడేందుకు వారంతా సిద్ధంగా ఉన్నట్టు హెచ్చరించింది.

పాక్‌లోని ఐఎస్‌ఐ అండతో సరిహద్దులు దాటేందుకు అఫ్గాన్‌ మూకలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. వీరికి టిఫిన్‌బాంబుల తయారీలో పాక్‌ శిక్షణ ఇచ్చిందని అప్రమత్తం చేసింది. జమ్ముకశ్మీర్‌లోకి చొరబడి దాడులు చేయొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు పారామిలటరీ, రాష్ట్ర పోలీసులను నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి.

ముష్కరుల కదలికలపై పక్కా సమాచారం ఉందని వెల్లడించాయి. జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌ వద్ద నియంత్రణ రేఖ సమీపంలో పాక్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాల్ని సైన్యం భగ్నం చేసింది. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. వారి నుంచి ఐదు రైఫిళ్లు, ఏడు తుపాకీలు, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు అధికారులు.

Related posts

(Professional) Diabetes Latest Drugs Reduce High Blood Sugar Fast Diabetes Meds Side Effects

Bhavani

అధికారం కోస‌మే టీడీపీ మా పొట్ట కొడుతోంది…!

Satyam NEWS

విద్యార్ధులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

Satyam NEWS

Leave a Comment