రోడ్డు మీద పది రూపాయల దొరుకుతూనే చటుక్కున జేబులో పెట్టుకునే ప్రస్తుతకాలంలో…. ఏకంగా 50 వేల రూపాయలు తమకు దొరికితే పోగొట్టుకున్న వారికి తిరిగి ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే….మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎటిఎం లోపల 50.000 వేల రూపాయలు 6TV స్టాఫ్ రిపోర్టర్ రహీమ్, సాయి T లైన్ 24, CVR మని ప్రసాద్, ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ కి డబ్బులు దొరకడం జరిగింది, ఎటిఎం లో పోగొట్టుకున్న వారిని తెలుసుకొని ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ తిరిగి వారి డబ్బులను వారికి అందజేశారు,
డబ్బులు మళ్లీ దొరకవని అనుకున్నాం, చాలా మనస్థాపానికి గురి అయ్యాం కానీ మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నమని జర్నలిస్ట్ లను బాధితులు అభినందించారు. ఎవరికి అయినా ఇలా డబ్బులు దొరికితే మీలా తిరిగి ఇవ్వడం చాలా మంచి పద్దతి.
ప్రస్తుత సమాజంలో మీలాంటి మంచి మనసున్న వారు ఉన్నందుకే మంచితనం, మానవత్వం బ్రతికే ఉందని నమ్మవచ్చు అని బాధితులు అన్నారు. మీలాగా ప్రతి ఒక్కరు ఇలాంటి మంచి పని చేసి మానవత్వం చాటుకోవాలని వారు కోరారు.