ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం పని చేయాలని ప్రభుత్వం విప్ గువ్వల బాలరాజు సూచించారు. గురువారం పల్లెనిద్ర కార్యక్రమం లో భాగంగా పదర మండల కేంద్రంలో ఆయన వార్డులో పర్యటించిప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మండల కేంద్రంలో 35 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు. అనంతరం సిసి రోడ్లు, కరెంటు స్తంభాలు, డ్రైనేజీ పనులు, మిషన్ భగీరథ పనుల పై అరా తీశారు. అనంతరం రాత్రి పదర మండల కేంద్రంలోనే పండుకొని కార్యకర్తలతో పలు సమస్యలు తెలుసుకుంటారని అన్నారు. శుక్రవారం ఉదయం అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ జడ్పిటిసి రాంబాబు నాయక్ ఎంపీపీ బిక్ష నాయక్ వైస్ ఎంపీపీ వరుణ్ కుమార్ జిల్లా నాయకులు నరసింహ రెడ్డి ఎం పి టి సి సునీత శ్రీను ఎల్లమ్మ శ్రీను మండల అధ్యక్షులు ఎడమ వెంకటయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు ముత్యాలు సింగిల్విండో డైరెక్టర్ రమేష్ యాదవ్ వెంకటయ్య శంకర్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు