38.2 C
Hyderabad
April 25, 2024 12: 10 PM
Slider నిజామాబాద్

పల్లె ప్రగతి పనులపై గ్రామ పాలకవర్గాల సమీక్ష

Palle Pragathi

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని బండరెంజల్, సీతారాంపల్లి, మిషన్ కల్లాలి, గుండె నమిలి గ్రామాలలో పంచాయతీ పాలకవర్గ సమావేశాలు  శనివారం జరిగాయి.

ఈ సందర్భంగా గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా నూతనంగా  కొనసాగుతున్న అభివృద్ధి పనులు వైకుంఠ ధామం, కంపోస్టు షెడ్డు, ప్రకృతి వనం, విలేజ్ పార్కు పనులు నిర్మాణ దశలో  ఉన్నాయి.

నూతనంగా గుండె నమిలి సీతారాంపల్లి గ్రామాల్లో రైతు వేదిక పనులు ప్రారంభమయ్యాయని వాటిని కూడా ఈ నెలాఖరు వరకు పూర్తి చేసే విధంగా ప్రణాళికతో ముందు వెళుతున్నామని ఆయా గ్రామాల సర్పంచ్లు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సీతారాంపల్లి సర్పంచ్  గంగారెడ్డి,కార్యదర్శి యాస్మీన్, బండరెంజల్ సర్పంచ్  గడ్డం బాల్రాజ్,కార్యదర్శి అమృత ,మిషన్ కల్లాలి సర్పంచ్ సరస్వతి బాయి, గుండె నమిలి సర్పంచ్ రాణి కిష్టారెడ్డి , పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచులు కోఆప్షన్ సభ్యులు  పాలకవర్గ సభ్యులు ఉన్నారు.

Related posts

రక్తదానం తో ప్రాణాలు నిలబెట్టిన DSR ట్రస్ట్

Satyam NEWS

కువైట్ హెల్పింగ్ హ్యాండ్ ఆక్సిజన్ సిలిండర్లు వితరణ

Satyam NEWS

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదు

Satyam NEWS

Leave a Comment