పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన డంపింగ్ యార్డు స్మశానవాటిక ట్రాక్టర్ల కొనుగోలు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పరిషత్ సిఈఓ, డిపిఓ, డిఆర్ డిఓ మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన డంపింగ్ యార్డ్ స్మశాన వాటికల నిర్మాణం పనులను, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ కొనుగోలు పనులను వేగవంతం గా పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం వార్డుల వారీగా సోమవారం మధ్యాహ్నం లోగా కమిటీలు ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు.
గ్రామాలలో పట్టణాలలో పారిశుధ్యం, హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ చౌహన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్ ఎల్.డి.యం. హరికృష్ణ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.