పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం భక్తుల తో కిటకిట లాడింది. కార్తీక మాసం మూడవ సోమవారం కావ వెడంతో తెల్లవారుజాము నుంచి స్వామిని దర్శించుకొనుటకు భక్తజన సందోహం పోటెత్తింది. ఈరోజు శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు అని ఈరోజు కేదారేశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం చేసుకుంటే మహా పుణ్యం అని ఆలయ అర్చకులు అనిల్ తెలిపారు. ఈరోజు దీపదానం, సాలగ్రామ దానాలు చేస్తే మహా పుణ్యఫలం లభిస్తుందని అనిల్ అన్నారు.
previous post