పంచాయతీ ఎన్నికల నాల్గో దశ చివరి విడత పోలింగ్.. కట్టుదిట్టమైన భద్రత నడుమ సాగుతోంది. కడపటి వార్తలు అందేసరికి విజయనగరం జిల్లా వ్యాప్తంగా..54.7 శాతం నమోదైంది.
అయితే పోలింగ్ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసుల మానవత్వాన్ని చూపిస్తున్నారు.లాఠీ పట్టాల్సిన చేతులతోనే…నడవలేని వాళ్లను… ఎత్తుకుని మరీ పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లి.. ఓటు హక్కు ఓ జన్మ హక్కని స్వయంగా వాళ్లచే ఓటు వేయించి.. తిరిగి ఇంటికి అప్పజెప్పు తున్నారు.
పోలింగ్ తేదీకి ఒక్క రోజు ముందే ఎన్నికల బందోబబ్తులో పాల్గొనే సిబ్బంది యావన్మందికి జిల్లా ఎస్పీ రాజకుమారీ ఈ తరహాలోనే వీలైతే సహాయం చేయాలని చెప్పారు.
దీంతో ఎన్నికల విధులలో పాల్గొన్న సిబ్బంది అంతా ఆ రకంగానే విధులు నిర్వహిస్తున్నారు.