దేశంలో నిమ్మ, నారింజ రసాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ఆగ్రీ ఎక్స్ పోర్టు కార్పొరేషన్ బ్రాండ్ అయిన ఫైవ్ రివర్స్ పై పంజాబ్ కినోవ్ జ్యూస్ ను ప్రవేశపెట్టారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు అనునిత్యం తాగాల్సిన జ్యూస్ ను అందిస్తున్నట్లు పంజాబ్ ఆగ్రోస్ ప్రకటించింది.
నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తిని మార్కెటింగ్ చేయడం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించేందుకు ఈ ఉత్పత్తిని తీసుకువస్తున్నట్లు పంజాబ్ ఆగోస్ ప్రకటించింది. పంజాబ్ ప్రత్యేకమైన పండు అయిన పంజాబ్ కినౌ జ్యూస్ పరిశుభ్రత, రుచి, నాణ్యత పరంగా ఇతర వెరైటీల నుంచి పోటీని సమర్ధంగా ఎదుర్కొంటుందని పంజాబ్ అగ్రి ఎక్స్ పోర్ట్ కార్పొరేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మంజీత్ బ్రార్ తెలిపారు.
పంజాబ్ కినౌ ఇప్పుడు అన్ని ప్రముఖ రిటైల్ అవుట్ లెట్ లలో లభ్యం అవుతుందని ఆయన తెలిపారు. దేశంలో ఒక బ్రాండెడ్ పండును పరిచయం చేసిన మొదటి కంపెనీ తమదేనని ఇది తమకు గర్వకారణమన్నారు. ఒక పండును బ్రాండింగ్ చేయడం వెనుక ఉన్న ఆలోచన నాణ్యత, స్వచ్ఛత, రుచిలో ఒక నిర్దిష్ట స్థాయి నిలకడను నిర్వహించడం కిందికి వస్తుందని ఆయన తెలిపారు. మా ప్రయత్నం ఎప్పుడూ తాజాదనం ఉండేలా, పోషక పదార్థం చెక్కు చెదరకుండా ఉండేలా చూడటమేనని ఆయన అన్నారు. పురుగు మందుల అవశేషాలు లేని ఉత్తమమైన డ్రింక్ గా ఇది ఉంటుందని ఆయన వెల్లడించారు.