Slider ముఖ్యంశాలు

సంక్రాతి ఎఫెక్ట్ :పంతంగి టోల్ గేట్ వద్ద 2 కి.మీ మేర నిలిచిన వాహనాలు

panthangi toll gate

పండుగ రద్దీ మొదలైంది. పల్లెలకు వెళ్లే వారి వాహనాలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. పండుగ సెలవులకు తోడు వారాంతపు సెలవులు తోడుకావడంతో ప్రజలు పెద్ద ఎత్తున నగరాన్ని వీడుతున్నారు. దీంతో రోడ్లన్నీ బిజీగా మారిపోతున్నాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ ఉదయం వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలను త్వరగా పంపించి రద్దీని క్లియర్ చేసేందుకు టోల్ గేట్ వద్ద అదనంగా కౌంటర్లు తెరిచినా ఫలితం లేకుండా పోయింది. అంతకంతకూ పెరుగుతున్న వాహనాల రాకతో మరింత రద్దీగా మారుతోంది. మరోవైపు, ఫాస్టాగ్ మార్గాల్లోనూ రద్దీ కొనసాగుతోంది.

Related posts

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కోలా ను సన్మానించిన సినీ నటుడు సుమన్

Satyam NEWS

భర్తా ఇద్దరు పిల్లలు ఉన్నా మేనల్లుడ్ని ప్రేమించిన అత్త

Satyam NEWS

జాగ్రతలు తీసుకోండి సైబర్ నేరస్తుల బారిన పడకండి

Satyam NEWS

Leave a Comment