రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శూన్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో వాలంటీర్ లను ఏర్పాటు చేసి పెత్తందారీ విధానాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలన జరగడం లేదు.. ఇది ఒక స్టార్టప్ కంపెనీ లాగా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
గ్రామాల్లో కేసులు పెట్టి అధికార పార్టీ ప్రజలను భయపెట్టి ఉండవచ్చు…గ్రామాల్లో ప్రజలు ఎదురు తిరిగే రోజులు వస్తాయి అని ఆయన అన్నారు.
ముష్టికోవెల గ్రామంలో కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ప్రశాంతంగా వున్న గ్రామాల్లో కూడా అశాంతి రేపుతున్నారని, ఢాబాల్లో ఏ సి గదులు ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
కర్ణాటక అక్రమ మద్యం రాకెట్ నడిపిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.