27.7 C
Hyderabad
April 20, 2024 02: 30 AM
Slider నల్గొండ

కార్మికుల పట్ల బిజెపి అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా సమ్మె

#Auto Union

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం  ఆటో యూనియన్  ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో  నియోజవర్గ కార్మిక సంఘ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ మాట్లాడుతూ  టీఆర్ఎస్ కె.వి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు 26న, సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరారు. బిజెపి ప్రభుత్వం  కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న విధి విధానాలకు నిరసన తెలుపుతూ  26వ, తేదీన జరగబోయే సమ్మెకు  టీఆర్ఎస్ కె.వి అనుబంధ సంఘాలు, కార్మికులు పూర్తి మద్దతుతో సమ్మెలో పాల్గొనాలని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు ఇబ్రహీం, పట్టణ అధ్యక్షుడు ఉగాది మురళి, ట్రాలీ ఆటో యూనియన్ అధ్యక్షుడు గోపయ్య, టీఆర్ఎస్ కె.వి నాయకులు లింగరాజు, నాగుల్ మీరా, వెంకన్న, కుర్ర నాగేశ్వరరావు, యర్రగాని నాగరాజు, టీఆర్ఎస్ కె.వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

లంబాడాల ఆధ్వర్యంలో హోలీ పండుగ కాముని దహనం

Satyam NEWS

మధ్యప్రదేశ్ మధ్యంను స్వాధీనం చేసుకున్న మంగళగిరి సెబ్ పోలీసులు

Satyam NEWS

అరచేతి లో ప్రాణం

Satyam NEWS

Leave a Comment