మార్చి 28,29 తేదీలలో దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెను విజయవంతం చేయ్యాలని ఐ ఎన్ టి యు సి కోరింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండల కేంద్రంలో ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురువయ్య కరపత్రాలను ఆవిష్కరించారు.
చింతలపాలెం మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఐ ఎన్ టి యు సి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గురవయ్య మాట్లాడుతూ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక నిర్ణయాలు తిసుకుంటున్న మోదీ ప్రభుత్వానికి ప్రజలే సరియైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించు కోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశ అనంతరం కార్మిక సమ్మెకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు కత్తుల రవిందర్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి షేక్ జానిమియా, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుజ్జుల నరేందర్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నకేసి వెంకయ్య, పెద్దోజు శంకరాచారి,దోండపాటి వెంకటరెడ్డి,ఐ ఎన్ టి యు సి నాయకులు భూరెడ్డి వెంకటరెడ్డి,రమేష్ రెడ్డి,కాకునూరి రామిరెడ్డి,సోమిరెడ్డి, రవిందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్, హుజూర్ నగర్