ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారిని కాదని డబ్బులు ఇచ్చిన వారిని పదవుల్లో నియమించారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకుడు నర్సింహారెడ్డి ఆరోపించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన నర్సింహారెడ్డి పార్టీ నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
‘‘నేను ఎప్పటి నుండో పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నా…ముక్కు మొహం తెలియని వారికి పదవులు ఇచ్చారు… పార్టీలో ఎవరు సీట్లు అమ్ముకున్నారో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.
తాగుబోతు గాళ్ళకి పదవులు అమ్ముకొని పార్టీని కార్పొరేట్ స్థాయికి తీసుకొని వెళ్లారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.