37.2 C
Hyderabad
March 28, 2024 19: 44 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుక‌గా పార్వేట ఉత్స‌వం

#ParvetaUtsavam

తిరుమల శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన‌ మ‌రుస‌టి రోజైన ఆదివారం శ్రీవారి ఆలయంలో విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం ఏకాంతంగా జ‌రిగింది. సంక్రాంతి క‌నుమ పండుగ రోజు కూడా తిరుమ‌ల‌లో పార్వేట ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.

ఈ సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని కల్యాణోత్స‌వ‌ మండపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వేంచేపు చేశారు.

శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు పంచాయుధాలైన శంఖం, చ‌క్రం, గ‌ద‌, ఖ‌డ్గం, ధ‌నస్సు ధ‌రించి పార్వేట ఉత్స‌వంలో పాల్గొన్నారు. ఈ ఉత్స‌వంలో భాగంగా టిటిడి ఈవోకు ఆల‌య మ‌ర్యాద ప్ర‌కారం ప‌రివ‌ట్టం కట్టారు.

క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో అడ‌విని త‌ల‌పించేలా ఏర్పాట్లు

కోవిడ్‌-19 నిబంధ‌న‌ల కార‌ణంగా ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ ‌మండ‌పం ఆవ‌ర‌ణంలో టిటిడి అట‌వీ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏడుకొండ‌లతో పాటు శేషాచ‌లాన్ని త‌ల‌పించేలా రూపొందించిన న‌మూనా అడ‌విలో వివిధ ర‌కాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు.

అందులో వ‌న్య‌మృగాల బొమ్మ‌ల‌ను ఉంచారు. ఈ ప్రాంతంలో స్వామివారు వేట‌లో పాల్గొన్నారు. అనంత‌రం విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టి స్వామివారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేశారు.

పార్వేట ఉత్స‌వం అనంత‌రం ఆల‌యం వెలుప‌ల ఈవో మీడియాతో మాట్లాడుతూ లోక‌క‌ల్యాణం, క‌రోనా నివార‌ణ కోసం శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలోనే ఏకాంతంగా నిర్వ‌హించామ‌ని చెప్పారు.

కోవిడ్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా పార్వేట ఉత్స‌వాన్ని కూడా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించామ‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసిన జీయ‌ర్‌స్వాముల‌కు, అర్చ‌క‌స్వాముల‌కు, అధికారుల‌కు, సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ భ‌ర‌త్ గుప్తా, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ ర‌మేష్‌రెడ్డి, ఎస్ఇలు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, నాగేశ్వ‌ర‌రావు, డిఎఫ్‌వో చంద్ర‌శేఖ‌ర్‌, విజివోలు మ‌నోహ‌ర్‌, ప్ర‌భాక‌ర్‌, పేష్కార్ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను తరిమికొట్టగలం

Satyam NEWS

బతుకు యుద్ధంలో…

Satyam NEWS

వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు

Bhavani

Leave a Comment